Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏటిఎంకు వెళ్లి నగదు డ్రా చేస్తే ఏమొస్తది.. డబ్బులు ఉంటే డబ్బులు వస్తాయి.. లేకుంటే ఖాళీ చిట్టీ వస్తాది. కానీ నగదు తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తులకు వింత అనుభవం ఎదురైంది. డబ్బులతో పాటు ఏదో రాసి ఉన్న చిట్టీలుకూడా వచ్చాయి. కొందరు పట్టించుకోలేదు. కానీ ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. టెక్సాన్లోని కార్పస్క్రిస్టీ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా కేంద్రంలో ఎలక్ట్రానిక్ లాక్ను మార్చేందుకు ఓ కార్మికుడు ఏటీఎం అమర్చిన గదిలోపలికి వెళ్లాడు. అందులో అనుకోకుండా చిక్కుకు పోయాడు. అతని మొబైల్కూడా ట్రక్కులోనే మరిచిపోవడంతో తాను చిక్కుకు పోయిన విషయాన్ని బయటకి చెప్పలేకపోయాడు. ఇలా రెండు గంటలు గడిపాడు. బయటపడే మార్గం కనిపించక చివరకు ఓ ఉపాయం తట్టింది. వెంటనే చీటీలపై 'నేను ఈ ఏటిఎం యంత్రంలో చిక్కుకుపోయాను.. తనను రక్షించండి.. నా ఫోన్కూడా నా దగ్గర లేదు. మా బాస్కు ఫోన్ చేయండి' అంటూ అతని బాస్ నెంబర్ను అందులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని వినియోగదారులు పోలీసులకు తెలియజేశారు. మొదట పోలీసులు జోక్ అనుకొని పట్టించుకోలేదు. తర్వాత యంత్రం వద్దకు వచ్చి పరిశీలించగా వ్యక్తి అరుపులు చిన్నగా వినిపిస్తుండటంతో వెంటనే బయటకు తీశారు. మన దేశంలో అలాంటి ప్రమాదమేమీ లేదులే.. అసలు ఏటీఎంలలో డబ్బుల కోసం వెళ్లే పనిలేకుండా చేశాడుగా మోడీసాబ్.
- పుప్పాల