Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీదర్కు చెందిన చీరలు అమ్ముకునే వ్యాపారి చంద్రశేఖర్ జెడీఎస్ పార్టీ వీరాభిమాని. 2018లో జరిగే ఎన్నికల్లో జెడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి విజయాన్ని కాంక్షిస్తూ రూపాయికే చీరను పంపిణీ చేశారు. వెయ్యి రూపాయల విలువైన చీరను కేవలం రూపాయికే ఇవ్వడం ఏంటని ఆరా తీయగా తనకు కలలో వెంకటేశ్వరస్వామి దర్శనమిచ్చిన రూపాయికే చీరలు పంచాలనీ, అప్పుడే తాను కోరుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పి మాయం అయ్యాడని చంద్రశేఖర్ సెలవిచ్చాడు. ఇక స్వామివారి మాట ప్రకారం సుమారు లక్ష చీరలను కేవలం రూపాయికొక చీర చొప్పున విక్రయించాడు. దీంతో తన చీరల దుకాణాల వద్ద మహిళలు వేల సంఖ్యలో బారులు తీరారు. ఇక మన ముఖ్యమంత్రి కెసీఆర్ సాబ్ వెంకటేశ్వర్ల స్వామి గుడికి వెళ్లినప్పుడు కల్లోకొచ్చి 50 రూపాయల చీరను 300లని చెప్పి జనాలకు పంచమన్నడేమో..! ఏదేమైనా తెలంగాణా వాళ్ల మీద ప్రేమెక్కువేమో వెంకటేశ్వర్లస్వామికి.
- పుప్పాల