Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సాహిత్య సార్వభౌముడు', 'అక్షర బ్రహ్మ', 'అక్షర నారాయణుడు', 'అక్షర తపస్వి, 'యశోమూర్తి', 'మన కాలపు మహాకవి' సినారె, రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి అని అక్షర బీజాన్ని వెదజల్లి నినదించి 'ఓ ప్రశాంత మరణంలోకి వెళ్ళిపోతే' 'ప్రగతి చీకటి' ఐంది. అతని కడసారి చూపు ఒలికిన కన్నుల భాష కవితా 'రుతుచక్ర'మైంది. ఆయన జీవితం 'ఒక పైరులాంటి కల'. అతని ప్రతి కవితా ఒక 'వాడని పువ్వు'. తెలుగు సాహితికి 'కవితా కేతనం'గా వున్న అందరికీ పెద్ద దిక్కు సినారె. మనల్ని వీడి గగన సీమను అధిష్టించిన విశ్వంభరుడు అయినాడు. ఆ మరణం లేని మహా వ్యక్తి కోసం ఎప్పుడు నీ తిరిగిరాక అంటూ ఎదురు చూశారు హైదరాబాద్ కవుల వేదిక వారు. 'మళ్ళీ ఉదయించు' మని పబ్బతి పట్టారు 47 మంది కవులు. సినారె నక్షత్ర యాత్రకు 'స్మృత్యంజలి' ఘటించారు. కవులకు ఊపిరైన 'విశ్వంభరుడి'కి 'ఏమివ్వగలం' భళారే సినారె అని 'కవితా వందనం' చేశారు. 'అల సి.నా.రె - అలసినారె' అనుకుని 'కొత్త చంద్రుడు' అయినందుకు 'మళ్ళీ ఉదయించు'మని 'నీ వుంటావు కలకాలం' అని 'అక్షరం ఒక నివాళి'గా అర్పించారు. 'అతని సంతకం' తెలుగు సాహితీ లోకానికి ఒక వెన్నెల. అలాంటిది ఇప్పుడా 'దిగులు వెన్నెల'ను చూసి 'ఆకాశం చెమ్మగిల్లింది'.
దిగులు వెన్నెల (సినారెకు కవితా నివాళి), సంపాదకులు : డా||రూప్కుమార్ డబ్బీకార్, డా||ఏనుగు నర్సింహారెడ్డి,
పేజీలు : 95, వెల : 60/-,
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు.