Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ దీప్తిధారులు
తెలంగాణ తేజోమూర్తులు- ఇల్లిందల సరస్వతీదేవి, పేజీలు: 100, వెల: రూ.70/-, ప్రతులకు: నవచేతన పుస్తక కేంద్రాలు
తెలంగాణ సమాజ, సాహిత్య, సాంస్కృతిక రంగాలకి ఇతోధిక సేవలు అందించిన తేజోమూర్తుల గురించి ఇల్లిందల సరస్వతీదేవి రాసిన పుస్తకమిది. రాజాబహద్దురు వేంకటరామారెడ్డి, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, ఆదిరాజు వీరభద్రరావు, రావి నారాయణరెడ్డి, మందుముల నరసింగరావు, సంగెం లక్ష్మీబాయి, సుమిత్రాదేవి, యల్లాప్రగడ సీతాకుమారిల గురించి సరస్వతీదేవి రాసిన వ్యాసాల పరంపర ఇది. తెలంగాణకు దీప్తినిచ్చిన ఈ ప్రముఖుల గురించి తెలుసుకోడం స్ఫూర్తిదాయకం. ఆయా రంగాల్లో వారు చేసిన కృషి ఈతరానికి గొప్ప ప్రేరణ.
కందుకూరిపై విశ్లేషణలు
క్రాంతదర్శి: కందుకూరి, సంపాదకులు: డా||తూమాటి సంజీవరావు, పేజీలు: 394, వెల: రూ. 450, ప్రతులకు: సెల్: 98844 46208
తెలుగుజాతి వైతాళికులుగా ప్రసిద్ధి చెందిన కందుకూరి వీరేశలింగం మరణించి వందేళ్ళు దాటింది. నేటికీ ఆయనకృషి గురించి తెలుగువారు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారి శతవర్థంతి సందర్భంగా చెన్నపురి తెలుగువాణి వారు 'క్రాంతదర్శి: కందుకూరి' అనే పుస్తకాన్ని ప్రచురించారు. విభిన్నరంగాల్లో కందుకూరి చేసిన కృషిని వివరించే దాదాపు 58 వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.తెలుగు సమాజంపై కందుకూరి వీరేశలింగం ప్రభావాల్ని విశ్లేషిస్తుంది ఈ గ్రంథం. డా. తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకం కందుకూరి గురించి మరింత అధ్యయనం చేయాలనుకునేవారికి ఉపకరిస్తుంది. - వికర్ణుడు
పదునైన కవితా సంపుటి
మెద, రచయిత : మునాసు వెంకట్, పేజీలు : 160, వెల : 150/-, ప్రతులకు : 9948158163
సామాన్యుల జీవభాషలో కన్నీళ్ళను కవిత్వీకరించే గుణం చాలా తక్కువ మంది కవులకే వుంటుంది. 'ఎన, వర్జి' సంపుటాలతోనే పేరు ప్రఖ్యాతులొందిన వెంకట్ -మునాసు మరోసారి 'మెద' కవితా సంపుటితో తెలంగాణ మట్టి పరిమళాల జీవభాషతో పాఠకుల్ని కదిలించారు. దాదాపు 50 కవితలున్న ఈ సంకలనంలో మనల్ని ఆలోచింపజేసే శక్తివంతమైన వ్యక్తీకరణలున్నాయి. సాగుభూమికి దూరమైన సామాన్యుడు చివరకు తిరగబడక ఏం చేస్తాడు? 'ముందుగాలనే చెబుతున్నాం' (పేజీ 16) అనే కవితలో చివరి వాక్యాలు కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. 'మళ్ళీ ఎలక సచ్చిన వాసన రాక ముందే / అణగారిన ఆటపాటలతో ఈనేలంతా అలుకుతూనే వుంటాం ఏకమై - ఏలికైన దాక' (ఇది 2013లోనే రాశారు). దు:ఖం తెల్సిన వారికే దు:ఖభాష అవగతం అవుతుంది. కొన్ని కవితలు చదువుతుంటే మానవత్వం వున్న మనిషి కండ్ల నుండి కన్నీరు రాక తప్పదు. పదునైన కవితలకు చిరునామా 'మెద' కవితా సంపుటి.
- తంగిరాల చక్రవర్తి,
9393804472
మూడు ప్రపంచాల విభజన సిద్ధాంతానికి మద్దతుగా
రచన : కా||దేవులపల్లి వెంకటేశ్వరరావు
పేజీలు : 116,
వెల : 75/-
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
వేదనామృతము
రచన : ఆచార్య అనుమాండ్ల భూమయ్య
పేజీలు :112, వెల:150/-
ప్రతులకు : ఎ. మనస్వినీదేవి, 7032668966.
నవోదయ పుస్తక కేంద్రాలు
మనిషి మేల్కొనేదెన్నడో
రచన : కొండూరి కోటిబాబు
పేజీలు : 94, వెల : 100/-
ప్రతులకు : కొండూరి కోటిబాబు, 9666233115
ప్రముఖ పుస్తక కేంద్రాలు
అమ్మకో అక్షరం
రచన : పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)
పేజీలు : 204,
వెల : 150/-
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
మరో మౌనపోరాటం (నవల)
రచన : పున్నమి
పేజీలు : 140, వెల : 100/-
ప్రతులకు : పున్న అంజయ్య, 9396610639
ప్రముఖ పుస్తక కేంద్రాలు