Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పు చెల్లించకపోతే ఆస్తులను వేలం వేయడం చూశాం. కానీ ఓ పన్నుల అధికారి మాత్రం ఆస్తులను, భూములను కాకుండా ఏకంగా పెంపుడు జంతువును వేలం వేసి అప్పు జమచేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన జర్మనీలో జరిగింది. పన్ను బకాయిపడ్డ సదరు యజమాని గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విధులకు కూడా హాజరుకావడం లేదు. ఈ క్రమంలో అతడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ను సకాలంలో చెల్లించలేక పోయాడు. కుక్క పన్నుతో సహా పలు ఇతర పన్నులు బకాయిపడ్డారు. దీంతో ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు వారికి బహుమతిగా వచ్చిన కుక్కను కూడా వేలంవేశాడు ఆ అధికారి. ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన కుక్క కాస్తా రూ. 60వేలకు అమ్ముడైంది. ఈ విషయమై సదరు అధికారిపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్ను వసూలు కోసం కుక్కను అమ్మాడంటే మనుషుల్ని కూడా అమ్ముతాడనడంలో సందేహం లేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ విషయం మనకేం ఆశ్చర్యమేం కాదుగా ఎందుకంటే.. అప్పు చెల్లించడం కోసం ఆలిని తాకట్టు పెట్టిన హరిశ్చంద్రుడు మనకు ఆదర్శమేగా.
- పుప్పాల