Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టిరంగు బొమ్మలు -సిరికి స్వామినాయుడు, పేజీలు:168, వెల:100/-, ప్రతులకు: స్నేహకళాసాహితి, పార్వతీపురం. 9494010330
ఉత్తరాంధ్ర ప్రాంత జీవన సంక్షోభాన్ని ప్రతిఫలిస్తుంది సిరికి స్వామినాయుడు కవిత్వం. 'మట్టిరంగు బొమ్మలు' పేరుతో వచ్చిన అతని కవితా సంపుటిలో మొత్తం డెబ్బయి కవితలున్నాయి. ఆ ప్రాంత జీవన సంఘర్షణలు మాత్రమే కాదు అక్కడి భాషను వ్యక్తం చేయడం ఈ కవిత్వ ప్రత్యేకత. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభ స్థితి మీద కవి ఆర్ద్రంగా స్పందించారు. గ్లోబలైజేషన్ ఫలితంగా విచ్ఛిన్నమవుతున్న గ్రామీణ జీవితం తీరుతెన్నుల్ని కవిత్వంగా మలిచారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం పట్ల ఈ కవి నిరసనకి దర్పణం పట్టిందీ సంపుటి. మరోసారి శ్రీకాకుళం పోరాట బాటలో ఈ ప్రాంతం ప్రయాణించనుందని ఈ కవిత్వం చదివితే బోధపడుతుంది.
మహిళల కవిత్వానికి ప్రాశస్త్యం
తెలంగాణ మహిళ(కవిత్వం), పేజీలు:272, ధర:200/-, ప్రతులకు: పాలమూరు సాహితి, 90328 44017
తెలంగాణ మహిళలు కవిత్వ రంగంలోనూ రాణిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి అనేక మంది కవయిత్రులు కవిత్వాన్ని రాస్తున్నారు. తెలంగాణ మహిళ శీర్షికన వచ్చిన కవితా సంకలనంలో 209 మంది కవులున్నారు. పాలమూరు సాహితి ప్రచురించిన ఈ పుస్తకానికి రావూరి వనజ, జి. శాంతారెడ్డి, డా. పొద్దుటూరి ఎల్లారెడ్డి, డా. భీంపల్లి శ్రీకాంత్, డా. గుంటి గోపి, కొప్పోలు యాదయ్య సంపాదకులుగా వ్యవహరించారు. సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రధాన సంపాదకులుగా వచ్చిన ఈ పుస్తకంలో ఈ తరం కవయిత్రుల ఆలోచనా తరంగాలు ఎలా ఉన్నాయో చూడొచ్చు. వర్తమాన సమాజంలో మహిళల స్థితిగతుల్ని ప్రతిఫలించిన సంకలనమిది. తెలంగాణ మహిళల కవిత్వ ప్రాశస్త్యాన్ని చాటిచెప్పిన ఈ సంకలనం గెటప్ ఆకర్షణీయంగా ఉంది.
విలక్షణమైన అభివ్యక్తి
కొన్ని నవ్వులు ఏరుకుందామని - తుమ్మూరి రాంమోహన్ రావు, పేజీలు:160, వెల:150/-, ప్రతులకు: కవి సెల్: 97015 22234, ప్రముఖ పుస్తక కేంద్రాలు
బహుళ ప్రక్రియల్లో రచనలు చేసే తుమ్మూరి రాంమోహన్రావు కవిత్వం ప్రత్యేకమైంది. సాధారణమైన భాషలోనూ, మాండలిక పరిభాషలోని కవిత్వం రాయడం ప్రత్యేకత. జ్ఞాపకాల పలవరింతలు, ఒకనాడు మానవ జీవితాన్ని వెలిగించిన జ్ఞాపకాల స్మరణ ఈయన కవిత్వంలో కనిపిస్తుంది. 'కట్టెలపొయ్యి' కనుమరుగు కావడం గురించి రాసిన కవిత ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అలాగే 'శెనార్తులు' కవితని మాండలికంలో వైవిధ్యమైన రీతిన రాశారు. ఈ కవి ఆ మధ్యన వెలువరించిన 'కొన్ని నవ్వులు ఏరుకుందామని' పుస్తకంలో ఇలాంటి విలక్షణమైన కవితలు అరవైకి పైగా ఉన్నాయి. మనసు పెట్టి చదివితే ఈ కవిత్వ సారం, సారాంశం బోధపడతాయి. మన చుట్టూ ఉండే జీవితాన్ని కవి పరికించే దృష్టికోణం తెలుస్తుంది.
- వికర్ణుడు
చిరు మొగ్గలు
ఉప్పరి తిరుమలేష్
పేజీలు : 76, వెల : 30/-
ప్రతులకు : ఉప్పరి తిరుమలేష్,
ఇ.నెం.11-11, శ్రీకృష్ణానగర్, అమరచింత, వనపర్తి - 509130
ఫోన్ : 9618961384
ఎడారి వాసన
చంద్రయ్య ఎస్
పేజీలు : 72, వెల :50/-,
ప్రతులకు : డా||చంద్రయ్య ఎస్, ఫోన్ : 9963709032
ప్రముఖ పుస్తక కేంద్రాలు
మట్టి వాసన
(కవితా సంపుటి)
మేరెడ్డి యాదగిరిరెడ్డి
పేజీలు : 82, వెల : 80/-,
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
బతుకమ్మ నానీలు
డా|| భీంపల్లి శ్రీకాంత్
పేజీలు :50, వెల:30/-,
ప్రతులకు : డా||భీంపల్లి శ్రీకాంత్,
ఇం.నెం.8-5-38,
టీచర్స్ కాలనీ,
మహబూబ్నగర్.
ఫోన్ : 9032844017
యాన్ ఈవినింగ్ విత్ జావళీస్
ఇంగ్లీష్ : రావెల సాంబశివరావు, తెలుగు : మోదుగుల రవికృష్ణ
పేజీలు : 40, వెల : 40/-,
ప్రతులకు : నవోదయ, విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు