Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టపడకుండా బతకాలనుకుంటారు కొంతమంది. స్లోవేనియాకు చెందిన ఓ యువతి కూడా అలానే ఆలోచించింది. ఇన్సూరెన్స్ పరిహారంకోసం యువతి రంపంతో తన చేతినే నరికేసుకుంది. ఐదు వేర్వేరు బీమా సంస్థల్లో ప్రమాద, జీవిత బీమాలను తీసుకున్న 21యేళ్ల యువతి తన బంధువులతో కలిసి పక్కా ప్లాన్తో ఈ దుశ్చర్యకు పాల్పడింది. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే బీమా సంస్థల ద్వారా నాలుగు లక్షల యూరోలు(రూ. 3కోట్ల 14లక్షలు) ప్రతి నెలా 3000వేల యూరోలు (రూ.2.35లక్షలు) వస్తాయని ఆశపడిన యువతి ఈ దారుణానికి పూనుకుంది. అయితే ఊహించని విధంగా ఆ యువతి కావాలనే తన చేతిని నరుక్కున్నట్టు బయటపడింది. చేతిని నరుకున్న యువతి ఆ చేతిని ఇంట్లోనే వదిలేసి ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు ఏమైందని ప్రశ్నించగా ప్రమాదం జరిగినట్టు యువతి, ఆమె బంధువులు కట్టుకథ అల్లారు. డాక్టర్లు మాత్రం అది ప్రమాదం కాదని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువతిని, నలుగురు బంధువులను విచారించంగా జరిగిన విషయాన్ని బయటపెట్టారు. యువతితో పాటు మరో బంధువుకు ఎనిమిదేళ్ల శిక్ష పడింది. డాక్టర్లు యువతి చేతికి మళ్లీ కుట్లు వేసి అమర్చారు. డబ్బు ఊరకే రాదు అంటారుగదా ఇదే మరి.
- పుప్పాల