Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిశానిర్దేశం చేసే కవిత్వం
అంతర్నాదం, ఎలనాగ (8885563042), పేజీలు :73,
వెల : 70/-, ప్రతులకు : ఎలనాగ, 73, నక్షత్రకాలనీ, బాలాపూర్, వయా కేశవగిరి, హైదరాబాద్ - 500005.
''అందరిలా మనమూ పుట్టుతాం గిట్టుతాం కాని/ పట్టుమని పదిరోజులు బతికినా/ పరిమళించాలి జీవన గంధం'' అంటూ బతుకు పరమార్థం తెలిపిన కవి ఎలనాగ. ఆయన వెలువరించిన పదునాలుగో గ్రంథం 'అంతర్నాదం'. ఇందులో ఆయన రాసిన పద్యం, గద్యం, వచనం, గేయం, వ్యాసం... ఇలాంటి పంచ కషాయం పాఠకుడికి ఆరోగ్య రీత్యా పనికొస్తుందని ప్రకటించేశాడు. ఈ కవికి రవి తలె 'ఆత్మ విశ్వాసపు నిచ్చెన మెట్ల మీదుగా/ ఆకాశాన్ని ముట్టాలని తపన...'' వుంది. చిరకాలం నిలిచిన కవితకు/ చిరునామా జాషువా/ ఆంధ్ర భారతికి నీరాజనమెత్తిన/ అవతారం జాషువా'' అని ప్రకటించే సహృదయత వుంది. ''వచన ప్రక్రియలోకి వచ్చేముందు వాక్య రచనా కౌశల్యాన్ని వశపరుచుకోవాలి తమ్ముడూ'' అంటూ దిశానిర్దేశం చేయగల సత్తా వుంది'వాక్యాన్ని చదివితే వంగి దానికి సలాము చేయాలనిపించాలి. అట్లాంటి వాక్యాల్ని రాసే నైపుణ్యం రచించే వాడి కలంలోకెక్కాలి. హుందాగా వుందా నీ వాక్యం అనేది ఎంతో ముఖ్యం'' అనగల దార్శనీయత ఎలనాగలో వుంది.
- కె.హరనాథ్, 9703542598
విలక్షణమైన కవిత్వం
మాలిమి- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పేజీలు: 88, వెల: రూ. 80, ప్రతులకు: అరుణా పబ్లికేషన్స్, నల్లగొండ, సెల్: 94415 61655
విభిన్న సందర్భాల్లో అనేకానేక సంఘటనలపై స్పందిస్తూ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన కవితల సమాహారం 'మాలిమి'. ఈ సంపుటిలో 42 కవితలున్నాయి. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఈయన బడి గురించి చక్కటి కవిత రాశారు. అలాగే బతుకమ్మని ఒక పాటలో దృశ్యమానం రూపు గట్టించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 ప్రాముఖ్యతను మరో కవితలో చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభలు, తెలంగాణ భాష, ఉస్మానియా శతాబ్ది, సినారె అమరత్వం ఇతని కవితలకు ఇతివృత్తాలయ్యాయి. కూరెళ్ళ శ్రీనివాస్ అందమైన ముఖచిత్రంలో కూడిన ఈ పుస్తకం విలక్షణమైన కవిత్వంతో అలరారుతోంది.
తెలంగాణ చారిత్రక వ్యాసాలు
తెలంగాణ ఉద్యమంలో చారిత్రికాంశాలు- సంకేపల్లి నాగేంద్రశర్మ, పేజీలు: 292, వెల: రూ. 350, ప్రతులకు: సెల్: 94417 97650
చరిత్రలో తెలంగాణ వైశిష్ట్యాన్ని చాటి చెప్పిన పుస్తకం 'తెలంగాణ ఉద్యమంలో చారిత్రికాంశాలు'. సంకేపల్లి నాగేంద్రశర్మ రాసిన ఈ పుస్తకంలో 43 వ్యాసాలు ఉన్నాయి. తెలంగాణ శాసనాలు, చారిత్రక స్థలాలు, పర్యాటక కేంద్రాలు, ప్రాకృతిక సౌందర్యం, ప్రకృతి వనరుల గురించి ఈ వ్యాసాలు వివరిస్తాయి. చరిత్రక్రమంలో తెలంగాణకు ఉన్న ప్రత్యేతకల్ని రచయిత వివరించారు. వివిధ జిల్లాల్లోని విభిన్న ప్రాంతాలు ఎలాంటి ప్రత్యేకతలు కలిగివున్నాయో ఈ పుస్తకం చదివితే బోధపడుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన ఉద్యమానికీ, చరిత్రకీ గల సంబంధాన్ని రచయిత విశ్లేషించారు. పరిశోధకులకీ, విద్యార్థులకీ, సాహిత్యకారులకీ ఉపయుక్తమైన పుస్తకమిది.
చేను చెక్కిన శిల్పాలు
సోమేపల్లి వెంకటసుబ్బయ్య
పేజీలు :34, వెల : 60/-
ప్రతులకు : క్రిసెంట్ పబ్లికేషన్స్, 29-25- 43ఎ, వేమూరివారి స్ట్రీట్, సూర్యారావుపేట్, విజయవాడ - 520002
ఆమె (గజళ్ళు)
డా|| దిలావర్
పేజీలు : 60
వెల : 50/-
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
ముదనష్టపు రోజులు
(అరుణ తార కథలు)
సంకలనం : పరుచూరి సుబ్బయ్య
పేజీలు : 96
వెల : 30/-
ప్రతులకు : నవోదయ పుస్తక కేంద్రాలు
రామ రామ శతకం
శ్రీపాద సుబ్రహ్మణ్యం
పేజీలు : 104, వెల : 100/-, ప్రతులకు : శ్రీపాద సుబ్రహ్మణ్యం, ఇం.నెం.9. ఎస్బిఐ కాలనీ, గాంధీనగర్, పోస్ట్ ఆఫీస్ దగ్గర, హైదరాబాద్
విరహ సమీరాలు
బి.బాలకృష్ణ
పేజీలు : 48
వెల : 25/-
ప్రతులకు : 12-15-630, మాణికేశ్వరి నగర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, భాగ్యనగరం - 7