Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెండి, బంగారంతో నగిషీలు చెక్కి నవరత్నాలు పొదిగిన పెండ్లిపత్రికలను పంచే సంపన్నుల గురించి విన్నాం. బంగారు నగలు, పట్టుచీరలు వంటి ఖరీదైన కానుకలతో కూడిన పెళ్లిపత్రికలను ఇచ్చినవారినీ చూశాం. పెళ్లిపత్రిక అంటే వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఎంతో ఖరీదైనవి ముద్రించి పంచడం చూస్తుంటాం. కానీ బళ్లారి నగరవాసి పెళ్లి ఆహ్వానపత్రికను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. నగరంలోని సాయిగోపాల్, వాణికుమారిల కుమారుడు సాయి సందీప్ బాటనీ హెచ్ఓడీగా పని చేస్తున్నారు. అదే కాలేజీలో వక్షశాస్త్రం లెక్చరర్గా పని చేస్తున్న తేజస్వినితో అతని పెళ్ళి కుదిరింది. పెళ్లి ఆహ్వాన పత్రికలను వినూత్న తరహాలో ముద్రించాలని భావించిన సాయి సందీప్ మండుటెండల్లో తీయగా ఉపశమనం కలిగించే పుచ్చకాయ మీద పెళ్లిపత్రికను ముద్రించి, బంధుమిత్రులకు ఆహ్వానం పలుకుతున్నారు. వెయ్యి పుచ్చకాయ పత్రికల పంపిణీకి ఏర్పాట్లు చేశాడు. దీనిని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన పెళ్లి పత్రికను తయారు చేసి పంపిణీ చేసినా ఇలా చూసి అలా పడేస్తారని, దీంతో తాను అందించిన ఆహ్వాన పత్రిక వథా కాకూడదని, గుర్తుండాలన్న సంకల్పంతో పాటు కళింగర కాయపై పెళ్లి వివరాలను రాసిన కాగితాన్ని అంటించి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆహ్వాన పత్రికను చూసిన తర్వాత చల్లని పుచ్చకాయను ఆరగించాలన్నదే తన ఉద్దేశమన్నారు.
- పుప్పాల