Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా నదులపై బస్సులు, లారీలు వెళ్ళడానికి బ్రిడ్జి వుంటుంది. అలాగే రైళ్ళలో ప్రయాణించడానికి కూడా పెద్ద పెద్ద బ్రిడ్జిలు వుంటాయి. అయితే ఆ బ్రిడ్జిలపై బస్సులో ప్రయాణించినప్పుడు వినిపించని పెద్ద శబ్దం రైలులో ప్రయాణించినప్పుడు మాత్రం ఎందుకు వినిపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? రైలులో ప్రయాణించినప్పుడు శబ్దం ఎందుకు వస్తుందంటే...
రైలు ప్రయాణిస్తున్నప్పుడు రైలు పట్టాలకు, చక్రాలకు మధ్య ఘర్షణ వల్ల ధ్వని పుడుతుంది. దీనికి తోడు రైలు పెట్టెల్లో వచ్చే కంపనాల వల్ల, రైలుకు ఎదురుగా వీచే గాలి కలిగించే ఘర్షణ వల్ల కూడా శబ్దం వస్తుంది. అయినా కూడా రైలు నేల మీదున్న పట్టాల మీద ప్రయాణించేటప్పుడు, పట్టాల కంపన పరిమాణం తక్కువగా వుంటమే కాక కంపనాలు కూడా త్వరత్వరగా ఆగిపోతాయి. ఎందుకంటే పట్టాలను పట్టి వుంచే స్లీపర్లు భూమి మీద ఉండటం వల్ల నేల శబ్ద కంపనాలను గ్రహిస్తుంది. అదే బ్రిడ్జిపై గాని, వంతెనపైన గాని ప్రయానిస్తున్నప్పుడు రైలు పట్టాలను బిగించిన స్లీపర్ల కింది భాగంగా గాలిలో నిండి వుండటం లేదా గుల్లగా ఉండటం వల్ల శబ్ద కంపన పరిమాణం హెచ్చి శబ్ద తీవ్రత పెరుగుతుంది. ఈ బ్రిడ్జి కలిగించే ధ్వని కిందనున్న నేల, నీరు ప్రతిధ్వనింప చేయటం వల్ల ధ్వని స్థాయి మరింత పెరుగుతుంది.