Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యం : ఆలోచనలు-జ్ఞాపకాలు
రంగంటే ఇష్టం సాహితీ చింతనలు, చాగంటి తులసి, పేజీలు : 344, వెల : 200/-, ప్రతులకు : నవోదయ పుస్తక కేంద్రాలు
ఉత్తరాంధ్ర కథకుల మీదుగా ఒడియా సాహిత్య పరామర్శతో పాటు ఉత్తరాది రచయితల- రచనల విశ్లేషణ ఈ వ్యాసాల్లో కనిపిస్తుంది. తమ జ్ఞాపకాలలో నుండి చాసో, నారాయణ బాబు, రోణంకి, పురిపండా, ఆరుద్ర, శ్రీశ్రీ ఉప్పల లక్ష్మణరావు మొదలైనవారి సాహిత్య వ్యక్తిత్వాన్ని తెలియజేసిన తీరులో మనకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. గురజాడ, చాసోల మీదనే ఎక్కువ వ్యాసాలు రాయడం విశేషం. స్త్రీవాద దృక్పథంతో రాసిన వ్యాసాలు విభిన్నంగా రూపొందాయి. 'గురజాడ సృజించిన స్త్రీ, పూర్ణమ్మ కావ్య చిత్రణ, ఆధునిక కావ్యాలలో స్త్రీ పాత్రలు- గురజాడ జాడ, ఒడియా సాహిత్యంలో స్త్రీవాదం, జెండర్ స్పృహ -కె.రామలక్ష్మి సాహిత్యం, గబన్ నవలలో స్త్రీ పాత్రలు' లాంటి మంచి వ్యాసాలతోపాటు అమృతా ప్రీతం, కుర్రతుల్ ఐన్ హైదర్, ఆశాపూర్ణాదేవి, మహాదేవి వర్మ లాంటి ప్రముఖ రచయిత్రుల పరిచయం కూడా ఇందులో వుంది. అలాగే గోర్కీ 'అమ్మ' నవలపై రెండు వ్యాసాలు, అనువాద సాహిత్యంపై వున్న రెండు వ్యాసాలు చెప్పుకోదగినవి. లోతైన పరిశీలన, చక్కటి విశ్లేషణతో కూడుకున్న ఈ వ్యాసాలు సమాచారాత్మకం గానూ, విజ్ఞానాత్మకం గాను వుండి ఆసక్తిగా చదివింపజేస్తాయి.
- కె.పి.అశోక్కుమార్, 9700000948
హింసకు అతీతంగా - జె.కె
హింసకు అతీతంగా, జిడ్డు కృష్ణమూర్తి, తెలుగు సేత : ఆచార్య యన్.భాస్కరరెడ్డి, పేజీలు:132, వెల:130/-, ప్రతులకు:కృష్ణమూర్తి ఫౌండేషన్, ఇండియా, వసంత విహార్, 124 - 126, గ్రీన్వేస్రోడ్, చెన్నై-600028.
ఆధునిక తాత్విక సంపత్తును పంచిన ప్రపంచ మేధావుల్లో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. వారి ప్రసంగాలు నవ్యదృష్టిని, నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి. ఆలోచింపజేస్తాయి. ఆసక్తికరంగా సాగుతాయి. ధ్యానం గురించీ, గతం నుండి విముక్తి గురించీ వారు తనదైన శైలిలో ప్రసంగ పాఠాలు చెప్పారు. ప్రపంచ తత్వజ్ఞాలతో కొత్త ఆలోచనలు రగిలింపజేస్తారు. జె.కె.గారు 1970 ప్రాంతంలో ప్రపంచ వ్యాప్తంగా 'హింస' అనే భావజాలాలపై చాలా స్పష్టంగా, సూటిగా అత్యద్భుతంగా ప్రసంగాలు గావించారు. ఇవన్నీ శాంతామోనికా, కాలిఫోర్నియా శాండియాగో, లండన్, రోమ్ వంటి ప్రసిద్ధ నగరాల్లో జరిగాయి.
'హింసకు అతీతంగా' అనే ఈ పుస్తకంలో జె.కె. హింసను నేరుగా బంధించలేదు. దాన్ని విశ్లేషించనూ లేదు. ఆయన కేవలం హింసకు అతీతంగా ఎలా మనిషి మసలుకోవాలో మాత్రమే జవాబు అందించాడు. మనిషి మానసికంగా శాంతివైపు ఎలా అడుగులు వేయాలో ఈ పుస్తకంలో ప్రతిపాదనలు చేశాడు.
- కె.హరనాథ్, 9703542598
మహాత్మాగాంధీ
ముస్లిం సహచరులు - అనుచరులు, సయ్యద్ నశీర్ అహమ్మద్, పేజీలు :32, వెల : 25/-, ప్రతులకు : 919440241727
చైనాలోని పరిణామాలు
భారత- చైనా సంబంధాలపైన
పేజీలు : 282,
వెల :150/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
'పొట్టా'భిషేకం
డా||శంకరనారాయణ
పేజీలు :96, వెల : 81/-, ప్రతులకు : 0866-2421052
ప్రముఖ పుస్తక కేంద్రాలు
మనకేం కావాలి, రచన : ఎనిశెట్టి శంకర్, వెల : 10/-, ప్రతులకు : తుర్లపాటి లక్ష్మి,
ఫోన్ : 9704225469
శంకరాలు - 2
డా||శంకరనారాయణ
పేజీలు :96, వెల : 45/-, ప్రతులకు : 9849181712
ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఊయల
గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ
పేజీలు :70, వెల : 80/-, ప్రతులకు : గుళ్ళపల్లి కవిత కాంతికృష్ణ, ఫోన్ :9490003295
ROCK PEBBLES
a peer - Reviewed Journal of Language & Literature
Correspondence Address : Naranpur, Konandapur, Devidwar, Jajpur, Odisha, pincode : 755007
'cell : 9437009135