Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్లాస్టిక్ వాడకం వద్దంటూ పెద్దఎత్తున ఉద్యమాలే నడుస్తున్నాయి. నెమ్మదిగా ప్లాస్టిక్ బదులు జనపనార సంచులు, గుడ్డ సంచులు వాడటం మొదలైంది. గతంలో వియత్నాంలో ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ని విపరీతంగా వాడేవాళ్ళు. ఇప్పుడు నెమ్మదిగా ప్లాస్టిక్ పక్కన పెట్టి, ఆ స్థానంలో అరటి ఆకులు వాడుతున్నారు. బెండకాయలు, బీన్స్, మాంసం, ఆకుకూరలు వంటివి తాజా అరటి ఆకుల్లో ప్యాక్ చేస్తున్నారు. అలాగే పచ్చని తాటాకులు, కొబ్బరాకులతో అల్లిన బుట్టలలో వస్తువులు ప్యాక్ చేస్తున్నారు. పర్యావరణానికి ప్రమాదం కలిగించే ప్లాస్టిక్ను వాడబోమని అక్కడివారు చెబుతున్నారు. మరి మనదేశంలో మార్పు ఎప్పుడు వస్తుందో...