Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో వేదగిరి రాంబాబు తెలుగు కథా సాహిత్య చరిత్రను ఒక దగ్గర పోగు చెయ్యాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లోని ప్రతి జిల్లాకు సంబంధించి స్థానికులనే ఎంపిక చేసు కుని ఆయా జిల్లాల కథా సాహిత్య చరిత్రను వ్రాయించి ప్రచు రించారు. అదే కోవలో ఇప్పుడు డా.టి.శ్రీరంగస్వామి అవిభక్త తెలంగాణ తొమ్మిది జిల్లాల నవలా చరిత్రను, తొమ్మిది మందితో రాయించి ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు.
ఎవరూ చూడని-చదవని పుస్తకాలను, కేటలాగుల ఆధారంగా తెలంగాణ నవలా చరిత్రను నిర్మింపబోవడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి. ముందుగా నవల అంటే ఏమిటో నిర్వచించి, నవలా లక్షణాలకు అనువుగా వున్న వాటిని మాత్రమే తీసుకుని నవలా వికాస చరిత్రను నిర్మించడం శాస్త్రీయమైన పద్ధతిగా భావింపబడుతుంది.
ఇందులో మొదటి వ్యాసం ''నల్లగొండ జిల్లా నవలా సాహిత్యం''లో చిన్నా చితకా వాళ్ళందర్ని ప్రస్తావించారు. కాని భువన గిరిలో జన్మించి, హైదరాబాద్లో స్థిరపడిన ముక్తవరం పార్థసారథి గురించి ప్రస్తావించనే లేదు. సజనాత్మక రచయి తగా, అనువాదకుడిగా వారు ప్రసిద్ధులు. పన్నెండు నవలలు రాశారు. అనువాద నవలలు, కథలు కూడా ఎన్నో వున్నాయి. అలాగే మిర్యాలగూడకు చెందిన సికిందర్ అన్ని ప్రక్రియలలో విస్తతంగా రాస్తున్నారు. వీరు రాసిన అపరాధ పరిశోధక నవలలు పత్రికలలో అనుబంధ నవలలుగా వచ్చాయి. కొన్ని పుస్తక రూపంలో వెలువడినాయి కూడా.
వ్యాసాలన్నింటిలో ఏకరూపత వుండాల్సిన అవసరాన్ని సంపాదకులవారు గుర్తించినట్లుగా కనిపించదు. ఉదాహరణకు వారు మాదిరెడ్డి సులోచన వంద నవలలు రాసినట్లుగా సంపా దకీయ వ్యాసంలో వ్రాశారు. అదే ''రంగారెడ్డి జిల్లా నవలా సాహిత్యం''లో 90 నవలలు, 150 కథలు రాసినట్లుగా ఆ రచ యితా పేర్కొన్నారు. వీరిద్దరిలో ఎవరిది నిజం? ఆమె పేరు మీద తెలుగు అకాడెమీ వారు వేసిన మోనోగ్రాఫ్ చూస్తే అసలు నిజం తెలిసేది కదా. ''రంగారెడ్డి జిల్లా నవలా సాహిత్యం''లో లక్ష్మణరావు పతంగే గురించి చెబుతూ, ఆయన వెలువరించిన పుస్తకాల జాబితానివ్వడం బాగానే వుంది. కాని అందులోని ''సంక్షిప్త ఆంధ్ర సాహిత్య చరిత్ర, గోలుకొండ కథలు, భావసార క్షత్రియోత్పత్తి చరిత్ర'' అనే పుస్తకాలు అచ్చు కాలేదన్న విషయం ఎంత మందికి తెలుసు? మరింత ఖచ్చితంగా ఆ పుస్తకాలు వచ్చినట్లు ఎలా చెప్పగలిగారు? ద్వితీయాధారాల నుండి సమా చారాన్ని సేకరించే బదులుగా ఆ రచయితకు ఫోన్ చేసి వివ రాలు సేకరిస్తే బాగుండేది. అలాగే వారు రాసిన ''అసీం సాయి అద్భుత యాత్రలు'' అనే పుస్తకం లేనే లేదు. బహుశా ''అరబ్బు వీరుడు హతీం'' అయి వుంటుంది. వారు ప్రస్తావించిన మరో పుస్తకం ''ముచికుంద నుండి మూసీ దాకా'' కాదు. అది ''హైద రాబాద్ నుండి తెలంగాణ దాకా''. సేకరించిన సమాచారాన్ని సరి చూసుకోవాల్సిన ఎవరూ గుర్తించినట్లుగా లేదు.
ఇక ''నిజామాబాద్ జిల్లా నవలా సాహిత్యం''లో బోధన్కు చెందిన కస్తూరి మురళీకష్ణ 2010లో ''సౌశీల్య ద్రౌపది'' నవల రచించారు అనే ఏకవాక్యంతో రచయిత్రి గురించి సరిపెట్టడం సరికాదు. బోధన్ శక్కర్ నగర్ లో పుట్టిన కస్తూరి మురళీకష్ణ కుటుంబం నగరానికి తరలివచ్చి 46 ఏళ్ళవుతుంది. రంగారెడ్డి జిల్లా దమ్మాయిగూడెంలో స్థిర పడిన వీరిని రంగారెడ్డి జిల్లా నవలా సాహిత్యం పట్టించుకో లేదు. ఇక ''నిజామాబాద్ జిల్లా నవలా సాహిత్యం''లో ''సౌశీల్య ద్రౌపది'' గురించి మాత్రమే (రచయిత పరిచయం లేకుండా) చెప్పడం ఆశ్చర్యం. తెలుగులో అన్ని ప్రక్రియలలో విస్తతంగా రాస్తున్న ఈ రచయిత పట్ల ఇంత నిర్లక్ష్యమా? ఏ పత్రిక చూసినా అతని గురించి, అతని ఫోన్ నంబర్ గురించి తెలుస్తుంది కదా. ఫోన్ చేసి కనుక్కుని రాయలేరా? ఆయన ఏడు నవలలు ప్రచురింపబడ్డాయి.వివిధ విభాగా లకు చెందిన 46 పుస్తకాలను ప్రచురించిన సంగతి అందరికి తెలుసు. విస్తతంగా రాస్తూ అన్ని పత్రికలలో కనబడే వారి గురించే ఇంత శ్రద్ద తీసుకుంటే, మిగతా వారి గురించిన సమాచార సేకరణ ఎంత సలక్షణంగా వుంటుందో వూహించు కోండి. కరీంనగర్కే గర్వ కారణమైన పెద్దింటి అశోక్కుమార్ ఆరు నవలలు రాస్తే, ముక్తసరిగా మూడు నవలలతో సరి పెట్టడం అన్యాయం. అలాగే బి.ఎస్.రాములు ''చూపు'' నవల ప్రస్తావనే లేదు. జీవిత చరిత్రలను నవలలుగా మలచడంలో నేర్పరియైన పి.చంద్ ''వరంగల్ జిల్లా నవలా చరిత్ర'' లో చోటు దక్కించుకోలేక పోవడం విచారకరం. పన్నెండు ఉద్యమ నవ లలు రాసిన పి.చంద్ వరంగల్లోనే విశ్రాంత జీవితం గడుపు తున్న సంగతి రచయిత(సంపాదకుడు) తెలుసుకోకపోతే ఎలా?
నవలా సాహిత్య చరిత్రలో పేర్కొన్నవారిలో స్థానికులు, వలసవచ్చినవారు, స్థిరపడిన వారిని కూడా ఏ భేదభావం లేకుండా అక్కున చేర్చుకోవడం హర్షణీయం. హైదరాబాదు జిల్లా అంతా వలసవచ్చిన వాళ్ళతో నిండిపోయి వున్నందున, హైదరాబాద్ జిల్లాని పక్కనబెట్టి వుంటారు. సమాచారాన్ని సేకరించడం ఒక ఎత్తు. దాన్ని వింగడించి, విశ్లేషించడం మరో ఎత్తు అని పరిశోధక మిత్రులు గమనించాలి. నిజాయితీతో, నిబద్దతతో పనిచేసినప్పుడే అసలైన నిజాలు బయటపడతాయి. మార్పులు, చేర్పులు అవసరమైనప్పటికీ ఈ పుస్తకం సమగ్ర తెలంగాణ నవలా సాహిత్య చరిత్రకు బ్లూప్రింట్ లా ఉపయోగ పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
(తెలంగాణ నవలా సాహిత్యం - సంపాదకత్వం : డా.టి. శ్రీరంగస్వామి. శ్రీలేఖ సాహితి, వరంగల్, పేజీలు :80, వెెల : రూ. 80/-, ప్రతులకు : నవోదయ, నవ చేతన పుస్తక కేంద్రాలు)
- కె.పి.అశోక్కుమార్, 9700000948