Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇద్దరు అగ్రతారలు నిర్మాతలైతే, ఒకరు తీసే చిత్రంలో మరొకరు నటించాల్సి వస్తే పారితోషకం విషయంలో ఒక అవగాహనకు రావడం ఎలా అనే సమస్య ఎదురవువుతుంది. అటువంటి సమస్యను ఎదదుర్కొన్న తారలు ఎన్టీఆర్, భానుమతి! ఆ సందర్భం ఏమి టంటే, ఎన్టీఆర్ తన సొంత చిత్రం 'తాతమ్మ కల'లో భానుమతిని ప్రాధాన పాత్రకు ఎంపిక చేశారు. ఆమెకు పారితోషకం ఎంత ఇవ్వాలనే అంశం చర్చకు వచ్చింది. అది చాలా సున్నిత మైన అంశం. ఒక పక్క 'అహం' దెబ్బ తిన కూడదు. మరో పక్క ఎవరూ 'హర్ట్' అవ్వ కూడదు. అటువంటి చిక్కు సమస్య పరిష్కారానికి భానుమతే ఎన్టీఆర్కు ఓ సలహా చెప్పారు. ఎన్టీఆర్ తను మామూలుగా హీరో పాత్రకు తీసుకునే పారితోషకంతో ఐదు వేల రూపా యలు తగ్గించి తనకు ఇమ్మని సూచించారు. అప్పట్లో అత్యధిక పారితోషకం తీసుకునే ఎన్టీఆర్ బాగా ఆలోచించి, ఒక మొత్తాన్ని నిర్ణయించి ఆమెకు చెక్కు పంపించారు. అంటే తను ఆమెకు ఇవాల్సిన పారితోషకం కాబట్టి- తన ధోరణి ప్రకారంబాగా తగ్గించే ఆ ఎమౌంట్ నిర్ణయించారు. అలా జరుగు తుందని ముందుగానే ఊహించిన భానుమతి, చెక్కులో తనకు వేసిన ఎమౌంట్కు ఐదు వేలు కలిపి- ఆ మొత్తానికి ఆమె ఎన్టీఆర్కు చెక్కు రాసి పంపిస్తూ, తను ఎన్టీఆర్తో తీయ బోయే 'అమ్మాయి పెళ్లి' చిత్రానికి ఇది పారి తోషకంగా చెబుతూ, ఆయన 'డేట్స్' కోరారు! ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయినా, ఆయన ఆ ప్రతిపాదనకు అంగీకరించక తప్పలేదు. ఎన్టీఆర్ను బోల్తా కొట్టించిన భానుమతి గడుసుతనానికి అప్పట్లో పరిశ్రమ లోని పెద్దలు ఆశ్చర్యపోయి నవ్వుకున్నారు.