Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అధికారపు ఆరాటం, పదవులకై పోరాటం
పీడిస్తూ శాసించే విశృంఖల విన్యాసం
దోపిడీల దాష్టీకాల దగా కోరు దర్జన్యం
ఎన్నాళ్ళిక, ఎన్నాళ్ళిక, ఎన్నాళ్ళిక, ఎన్నాళ్ళని'' ఇదీ కోసరాజు కృష్ణ ప్రసాద్ దర్మాగ్రహం. ఈ అసమ సమాజంపై ఈ కవియెత్తిన శరాఘాతం. తొలి కవితలోనే ''మాతా పిత: నమామి'' అంటూ తన తల్లిదండ్రులకు నమస్కారం చెప్పాడు. ఇది సంస్కారానికి నిదర్శనం. ''వ్రాసితి'' అనే కవితలో ఉద్ధండ సాహితీ దురంధరులకు తానే వారసుడిగా నిరూపించుకున్నాడు.
రాసింది వచన కవిత్వమైనా కృష్ణ ప్రసాద్ కవితలో లయను పాటించాడు. ఆందువల్ల గేయ కవితా ఛాయలు ప్రస్ఫుటమైనాయి 'నిండు వేసవిలోన మండుటెండను సైతం / పండు వెన్నెలగ తలచి పలుగు పట్టె'' వంటి చరణాలు ఇందుకుదాహరణలు. ''నేడు'' కవితలో జగతిని తెల్లారేటట్లు చేసాడు 'పల్లెసద్దు' కవితలో గ్రామీణంను నిద్ర లేపింది. కృష్ణప్రసాద్ తెలుగు నేలంతా ఒక్కటిగా ఉండాలనే ఆకాంక్ష మిక్కుటంగా ఉన్నవాడు. తన వివాహ బంధాన్ని తన అత్తమామల షష్టి పూర్తి మహౌత్సవాన్ని తన గృహ సముదాయంలో మరణించిన బాలున్ని గూర్చి ఇలా సందర్భోచితంగా రాసిన కవితలు కూడా ఉన్నాయి. ఈ కవితను అనేక కొత్త పదాల్ని వాడడం వల్ల పాతక్కలకు వాటని పరిచయం చేసాడు. ఉదా|| కిరకుడు, క్షితము, కంథము, నిశ్రేణి మొ|| రాసిన ప్రతి కవితకు టీకా, తాత్పర్యాలు అందివ్వడం వల్ల పామరులకు సైతం అంగాహనావకాశాలు అందించినట్లయింది.
అంతర్వాణి (కవితా సంపుటి), రచన : కొసరాజు కృష్ణప్రసాద్, పేజీలు : 121, వెల : రూ. 40/-, ప్రతులకు : జ్యోతి వలబోజు, జె.పి.పబ్లికేషన్స్, హైదరాబాద్. సెల్ : 8096310140
- కె.హరనాథ్, 9703542598