Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దర్భశయనం శ్రీనివాసాచార్య'' తన కవిత్వంతో రైతులకు బాసటగా నిలుస్తూ రైతుల కంఠఘోషను వినిపిస్తున్న కవి.అంతకు ముందు వెలువడిన కవితాసంపుటాలలో కూడా రైతుల వెతలనెన్నో కవిత్వీకరించాడు. సరళత, స్పష్టత, నిర్దుష్టత, చక్కని అభివ్యక్తి ఈ కవి లక్షణాలు.
''ధాన్యం గింజలు'' ఎవరికోసమనే ప్రశ్న వేసుకుంటే
అమాయకపు రైతులను మోసం చేసే దళారుల కోసం కావచ్చు.గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వాల కోసం కావచ్చు.రైతుకు గౌరవం దక్కని చోటును నిలదీయటం కోసం కావచ్చనే సమాధానాలు పాఠకుడికి కవి కానుకగా దొరుకుతాయి.పాఠకుడి సమర్థతను బట్టి ఇంకొంత ఎక్కువ సమాచారాన్నే పొందొచ్చు.పూర్తిగా ఈ కవిత్వపు గింజలు రైతు పక్షాన మొలకెత్తినవి.
''ధాన్యం గింజలు'' రైతు జీవితానికి ప్రతీకలు.ఈ గింజలలో పచ్చదనపు జాడలు, బతుకు ముద్రలు, విశాలతను సంతరిం చుకున్న పలకరింపులు, ధర పలకని మిరప ఘాట్లు, లోలోపలి ఆత్మీయ పాటలు, పంట పొలాల సోయగాలు, ప్రకతి ఒడి పరవశాలు, దూర భారాలు, పురా స్మతులు, స్నేహ పరిమళాలు తాజాగా దర్శన మిస్తాయి.
వెంటాడే వాక్యాల్లోకి...
1) ''మహాసముద్రాలు మహాద్భుతాలే కావచ్చు
నేను మాత్రం
ఈ పంటకాల్వకు మోకరిల్లుతాను (పంట కాల్వ)''
మనిషి తాపత్రయంతో అద్భుతాలను సష్టించటంలో మునుముందుకు అడుగే యటం తప్పుకాదు.తన పూర్వస్థితిని గుర్తుపెట్టుకోకపోవటం వెనక్కి మరలి చూడకుండా అడుగులు వేయటం తప్పని చెబుతూ కవి అన్నం పెట్టే పంటపొలానికి మోకాళ్ళపై నుండి నమస్కరిస్తాననటంలో ఒక సంస్కారవంతమైన, ఆదర్శ వంతమైన ప్రతిపాదన పాఠకున్ని వెంటాడుతుంది. మొదటి అడుగును మరచిపోకూడదన్న విశ్వాసాన్ని కనబరుస్తూ ఈ వాక్యాలను పలకటంలోనే కవిది లోతైన, బిగుతుగల గొంతుక అని అర్థమవుతుంది. ఈ వాక్యాల్లో సముద్రాన్ని ఎవ్aజూష్ట్రశీతీ గా తీసుకొని కవి పాఠకుడిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.
2) ''ఒక చేతిలో అన్నం
మరో చేతిలో ఆయుధం
తప్పలేదు
తప్పనపుడు ఇంకా
అన్నాన్నైనా వొదులుకుంటుంది కానీ
ఆయుధాన్ని వోదులుకోదు''(తెలంగాణ)
తెలంగాణ ప్రజల అభిమతాన్ని తెలిసిన వాడుగా ఈ కవిని చెప్పవచ్చు.ఉద్యమంలో కావచ్చు. తమ అస్తిత్వాన్ని నిలుపు కోవటంలో కావచ్చు.ఇక్కడి ప్రజలు వీరోచితంగా పోరాటం చేస్తారు. ఆయుధాన్ని చేపడతారు. ఆత్మార్పణకు కూడా వెనుకాడరనే నేపథ్యాన్ని వివరిస్తూ ప్రాంతాన్ని వస్తువుగా తీసుకొని ఈ వాక్యాలతో పాఠకులను కట్టిపడేస్తాడు.ఇక్కడ కవి ''నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్''అంటూ తెలంగాణ తల్లి పరాక్రమాన్ని విశదీకరిస్తూ దాశరథి గారు రచించిన పద్యాలను గుర్తుకు తెస్తారు.
3) ''పొలాలే రాజధానులవుతాయి
పైర్లే శాసనాల్ని రాస్తాయి
నాగటిచాళ్ళ సాక్షిగా
అట్లా! ఒక పొలాల రాజ్యం రూపెత్తుతుంది'' (ముంబాయి మొదలు)
పంట పండించిన వాడు పస్తులుండటం జీర్ణించుకోలేని విషయం..''సముద్రాన్ని తలాపున పెట్టుకొని చేప నీళ్ళకోసం ఏడ్వటం'' అనే సామెతనిక్కడ ఆపాదించొచ్చు. శ్రమించడమే తెలిసిన పాదాలు,బురదనే సుగంధంగా కళ్ళద్దుకునే పాదాలు రోడ్డెక్కటం,అలాంటి హీనమైన కాలంలో మనముండటం ఎంతో దురదష్టకరం.ఇలాంటి సందర్భంలో స్పందనగా ఈ కవి ''పొలాలే రాజధానులవుతాయి''అనే గొప్ప ఊపిరినిచ్చే వాక్యాలు,ప్రేరణ నిచ్చే వాక్యాలు రాసి రైతులకు వెన్నుదన్నుగా నిలవటం ఎంతో ముదావహం.కవి భాద్యతను నెరవేర్చటంలోని సమర్థత ఈ కవిలో పుష్కలంగా ఉందని ఈ వాక్యాలు ఋజువు చేస్తున్నాయి.
4) ''దేశం
వెలిగీ వెలిగీ
పొలాలకు దూరమయింది''(అభివద్ది)
వెలుగంటే ఒక రూపంలో సంతోషం. వెలుగును సంతరించుకున్నప్పుడు మనుషులంతా హాయిగా జీవించాలి కదా కానీ వెలుగు అభివద్ది పేరిట వినాశమైనదని మూలాలను కూడా పెకిలించి వేస్తుందన్న అర్థంలో ఈ వాక్యాలను రాశాడు. వెలుగుకిక్కడ కవి వ్యతిరేఖ సంజ్ఞను జోడించాడు.ఒక విధంగా చెప్పాలంటే ''అతి'' అనేది ఎందులోనైనా మంచిది కాదు.
కవి చెప్పినట్టుగా జీవనాడులైన పల్లెల వల్లనే,పంట పొలాల వల్లనే దేశానికి నిజమైన వెలుగు కలుగుతుంది.
ఇలా తన కవిత్వంలో అనుక్షణం రైతులు,పంటపొలాలు అంటూ పరితపించే రైతు భాందవుడు ''దర్భశయనం శ్రీనివాసాచార్య'' రైతుకవుల జాబితాలో సుస్థిరంగా తన పేరును లిఖించుకున్నాడనటంలో ఏమాత్రం సందేహాం లేదు.ఈ రైతుకవి కవితా వాక్యాలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను.
- తండ హరీష్గౌడ్, 8978439551