Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాలతి
నవతెలంగాణ-ఖమ్మం
కరోనా వ్యాక్సిన్ను మొదటగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులలో పని చేస్తున్న వైద్య సిబ్బంది వివరాలు తెలపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి అన్నారు. శుక్రవారం డీఎంహెచోఓ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాలతి మాట్లాడుతూ కరోనాను నియంత్రించడంలో జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడ సహకరించాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల, ల్యాబ్ లలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వివరాలు ఆన్లైన్ లో పొందుపరచటానికి ఎలాంటి పొరపాట్లు చేయకుండా తగిన పార్మెట్లలో వివరాలను నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీలు డాక్టర్ శోభాదేవి, డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, ఎన్హెచ్ఎంఎస్ డీపీఓ నిలోహన, జి.సాంబశివారెడ్డి, ఏఎస్ఓ హరికృష్ణ, డీడీఎం నాగరాజు పాల్గొన్నారు.