Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు ఖమ్మం నుంచి కోదాడ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. ప్రధానంగా ఖమ్మం రూరల్ మండల పరిధిలోని గుర్రాలపాడు నుంచి ముదిగొండ వరకు రహదారి ధ్వంసమైంది. ఇది ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. రహదారి గుంతల మయంగా మారడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంతో వరుసగా పలు ప్రమాదాలు సైతం చోటుచేసుకున్నాయి. ఇకనైనా అధికారులు మేల్కొని రహదారి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.