Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
నాట్ ఫర్ సేల్ అని ఉన్న 200 సిమెంట్ బస్తాలను అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయారు ప్రభు ద్దులు. భద్రాచలం శుక్రవారం సార పాకకు చెందిన కొన్ని ఐరన్ అండ్ సిమెంట్స్ షాపుల యాజమానులు ఇలా ఎటువంటి బిల్లులు లేని, ప్రభుత్వ పనులకు ఉపయోగించే సిమెంట్ బస్తాలు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివద్ధి చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోని ఐటీడీఏ రోడ్డులో ఒక ఇంటివద్ద సిమెంట్ బస్తాలను దిగుమతి చేస్తుండగా సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు లారీని పరిశీలించారు. ఈ సమయంలో ఆ లారీ డ్రైవర్ పారిపోయాడు. హమాలీలను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తహశీల్దార్ లారీని సీజ్ చేసి పోలీసు స్టేషన్కి తరలించారు. దీని విలువ సుమారు రూ.లక్షా 40 వేలు ఉంటుందని, అధికారులు చెబుతున్నారు. ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు. పట్టణంలో ఇలాంటి జీరో దందా వ్యాపారం చేయడంలో వ్యాపారులు ఆరితేరి ఉన్నారని, ఇది ఎప్పటినుండో నడుస్తున్నాయని తెలుస్తోంది. మరోపక్క ప్రభుత్వ పనుల కోసం ఉపయోగించే సిమెంట్, ఐరన్లు కూడా ఇలా పక్కదారి మల్లించడంలో కాంట్రాక్టర్లు కక్కుర్తి అవుతున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.