Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలో మంగళవారం ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించిన కేసుకు సంబంధించి సత్తుపల్లి ఎస్సై గజ్జల నరేశ్ సీసీ ఫూటేజీల ఆధారంతో 24 గంటల్లోనే చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం... దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన పెంబుల నాగరాజు, తగరం ప్రభుదాస్తో పాటు ఓ మైనర్ బాలుడ్ని గుర్తించామన్నారు. వీరు గంతలో కూడా చింతలపూడిలోని వైన్షాప్, గంగారం బెల్ట్షాపుల్లో చోరీ కేసులు ఉన్నాయన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న రూ. 40వేలు విలువచేసే 10 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్సై తెలిపారు. సీసీ ఫూటేజీ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల ఆచూకీని తెలుసుకొని పోలీసు సిబ్బందితో కలిసి వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. 24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన ఎస్సై నరేశ్, హెడ్ కానిస్టేబుల్ ప్రతాపరెడ్డి, కానిస్టేబుల్ లక్ష్మణ్లను ఏసీపీ వెంకటేశ్ అభినందించారు.