Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవార్డు అందుకున్న ఏఈ శ్రీనివాసరావు
నవతెలంగాణ-బోనకల్
ఖమ్మం జిల్లాలో ఉత్తమ మిషన్ భగీరథ ఇంజనీరుగా బోనకల్ మిషన్ భగీరథ ఏఈ శ్రీనివాసరావు ఎంపికయ్యారు. మిషన్ భగీరథ ద్వారా మండలంలో అన్ని గ్రామాలకు ఇంటింటికి నీరు అందించడంలో వందశాతం పనులు మండల ఏఈ శ్రీనివాసరావు పూర్తి చేశారు. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పనులు పూర్తి చేయటంలో జిల్లాలో శ్రీనివాసరావు అగ్రభాగాన ఉన్నారు. సీఎంవో పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేతుల మీదుగా హైదరాబాదులో బుధవారం ఉత్తమ అవార్డు శ్రీనివాస్రావు అందుకున్నారు. శ్రీనివాస రావు ఎర్రుపాలెం మండలం ఇన్చార్జిగా కూడా పని చేస్తున్నారు. శ్రీనివాసరావుని ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, జడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు అభినందించారు.