Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
- తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరా టౌన్
ఎండాకాలం (రబీ) సీజనులో ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్సీఐ ఉప్పుడు బియ్యంను కొనమని, ముడి బియ్యం మాత్రమే కొనుగోలు చేస్తామని విధించిన నిబంధనలను ఎత్తివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం వైరా మండలం పూసలపాడు గ్రామంలో గాలి అరుణ అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థల నిబంధనలు రైతులు నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి కాకుండా కొనుగోలు చేయకుండా ఉండేందుకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. వెంటనే ఎఫ్సీఐ విధించిన ముడి బియ్యం మాత్రమే కొనుగోలు చేస్తామని, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధర, బోనస్ రైతులకు ఇవ్వకూడదని నిబంధన విధించటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే కేంద్రప్రభుత్వ నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ద్రోణాదుల నాగేశ్వరరావు, గాలి ప్రేమసాగర్, గాలి శివ, అర్జునరావు, సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.