Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా టౌన్
వైరా మండలం సిరిపురం గ్రామంలో సిపిఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకురాలు గుంటుపల్లి సీతారావమ్మ (102) బుధవారం రాత్రి మరణించినారు. గుంటుపల్లి సీతారావమ్మ మరణం వార్త తెలియగానే సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యురాలు గాలి అరుణ, మండల కమిటీ సభ్యులు ద్రోణాదుల నాగేశ్వరరావు, సిరిపురం శాఖ కార్యదర్శి నల్లమల కోటేశ్వరరావులు గుంటుపల్లి సీతారావమ్మ భౌతిక దేహాన్ని సందర్శించి పార్టీ జెండాను కప్పి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరితోపాటు చింతనిప్పు చంద్రరావు, గాలి సాంబశివరావు, గాలి ప్రేమ సాగర్, నారికొండ అమరేంద్ర, అర్జునరావు, కృష్ణార్జునరావు, సిరిపురం సర్పంచ్ మట్టూరి ప్రసన్నంభా, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మట్టూరి నాగేశ్వరరావు తదితరులు నివాళులర్పించారు. గుంటుపల్లి సీతారావమ్మ తుది శ్వాస విడిచే వరకు ఎర్ర జెండా సిద్ధాంతాన్ని, కమ్యూనిస్ట్ భావాలను అలవర్చుకొని జీవించారు. సీతారావమ్మ ఆరుగురు కుమారులు కూడా తల్లి భావాలను అలవర్చుకొని పేద ప్రజల పట్ల సేవా దృక్పథం కలిగి ఉన్నారు.