Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
కరోనా వ్యాక్సిన్కు సంబంధించి కోవిన్ యాప్లో పేర్లను నమోదు చేనుకోవాలని డీఎంఅండ్హెచ్ఓ మాలతి తెలిపారు. జిల్లాలో 60 వయసు నిండిన వారికి, 45 నుంచి 59 ఏళ్లలోపు అనారోగ్య నమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతుందని, అదేవిధంగా శుక్రవారం నుంచి సత్తువలి, పెనుబల్లి, మధిర, నేలకొండపల్లి ప్రభుత్వ ఆనుపత్రులో వ్యాక్సిన్ అందిస్తామని ఆమె తెలిపారు. కోవిన్ యాప్ ద్వారా నమోదు చేసుకుని ఆయా సెంటర్లకు వెలితే వ్యాక్సిన్ అందిస్తారని ఆమె తెలిపారు. కోవిన్ యాప్ ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని, ప్రజలు ఆ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. గురువారం వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 350 మంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోగా 60 ఏళ్లు పైబడిన వారు ప్రభుత్వ ఆనుపత్రిలో 85 మంది, ప్రైవేటు ఆనుపత్రిలో 198 మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపారు. 45 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదుగురు, ప్రైవేటు ఆసుపత్రిలో 27 మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలిపారు