Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య
- టీఆర్ఎస్ పాలనలో న్యాయవాదులకు రక్షణ కరువు
- వామపక్షాల ఎమ్మెల్సి అభ్యర్థి జయసారధిరెడ్డి
- జిల్లా కోర్టులో విస్తృత ప్రచారం
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, న్యాయ వాదుల సమస్యలపై శాసనమండలిలో గళమెత్త గలిగే సత్తా ఉన్న వామపక్షాల అభ్యర్థి జయసారదిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కాసాని ఐలయ్య కోరారు. కొత్తగూడెం జిల్లా కోర్టులో గురువారం జరిగిన న్యాయవాదుల సమ్మెళన సభలో వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, దేశ ప్రధాన మోడీ ముందు మోకరిల్లే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. ప్రజలకు, కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా కేసీఆర్, మోడీ తీసుకుం టున్న నిర్ణయాలను వ్యతిరేకించని ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎమ్మెల్సీలు ఉన్నా లేనట్లేనన్నారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన గత ఎమ్మెల్సీ రాష్ట్ర రాజధా నికే పరిమితమయ్యారని, సమస్యలను గాలికొదిలేసి స్వంత పైరవీలు చేసుకున్నారని ఆరోపించారు. న్యాయవాదుల రక్షణకోసం పటిష్టమైన చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వంపై వత్తిడితెస్తానని స్పష్టం చేశారు. ఈ సభలో బార్ అసోషియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్షినేని సత్యనారా యణ, గోపికృష్ణ, న్యాయవాదులు సురేష్, ఉదరు భాస్కర్, రమేష్ కుమార్ మక్కడ్, రజాక్, జలసూ త్రం శివరాం ప్రసాద్, మునిగడప వెంకటేశ్వర్లు, ఉప్పశెట్టి సునీల్, దుర్గారావు, కె.పుల్లయ్య, బాగం మాధవరావు, . సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎజె.రమేష్, మచ్చా వెంకటేశ్వర్లు, వామపక్షాల నాయకులు గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివా సరెడ్డి, భూక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి ప్రధాన కార్యాలయంలో విస్తృత ప్రచారం
వామపక్ష పార్టీ అభ్యర్థి జయసారధిరెడ్డిని గెలిపించాలని కోరుతూ సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి, సిఐటియు ఆద్వర్యంలో గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్మ్శర్స్ యూనియన్ సలహాదారు దమ్మాలపాటి శేషయ్య, సిపిఐ, సిపిఎం పట్టణ కార్యదర్శులు వై.శ్రీనివా సరెడ్డి, భూక్య రమేష్ నాయకులు కంచర్ల జమలయ్య, కిష్టోఫర్ తదితరులు పాల్గొన్నారు.