Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేలుడు పదార్థాలు స్వాధీనం
నవతెలంగాణ-భద్రాచలం
మావోయిస్టులకు నిషేదిత పేలుడు పదార్థాలను సరఫరా చేయటానికి వెళ్తున్న ఎనిమిది మంది మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసి కోర్టుకు పంపినట్టు భద్రాచలం ఏఎస్పీ వినీత్ గురువారం రాత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఉదయం 11 గంటల సమయంలో దుమ్ముగూడెం ఎస్పై ఎం.రవికుమార్, సీఆర్ఫీఎఫ్ సిబ్బందితో రేగుబల్లి గ్రామం వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో మోటార్ సైకిల్పై ఇద్దరు వ్యక్తులు వస్తు పోలీస్లను చూసి పారిపోవుటకు ప్రయత్నించారు. వారిని వెంబడించి పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. ఈ క్రమంలో వారి వద్ద బ్యాగులలో 150 ఎలక్ట్రికిల్ డిటోనేటర్స్, 130 మీటర్ల కోర్టెక్స్ వైర్, లిక్కిడ్ జిలటిన్స్ 9 లభ్యమయ్యాయి. వారిని విచారించగా పద్దం రాజు, మిడియం పైక అలియాస్ రాజలుగా తేలిందని, వీరంతా తెలంగాణ మావోయిస్టు కమిటీ నర్సంపేట, గుండాల ఏరియా కమిటీ ఇంధార్జ్ భద్రు అలియాస్ పాపన్న పిలిచి దళంకు కావాల్సిన పేలుడు పదార్థాలు సమకూర్చాలని కోరినట్లు తేలిందని తెలిపారు. అదేవిధంగా తనకు సంబంధించిన వ్యక్తుల్లో నలుగురును సీతారామ ప్రాజెక్టు బ్లాస్టింగ్ వద్ద, మరో ముగ్గురిని పోలవరం ప్రాజెక్టు బ్లాస్టింగ్ వద్ద పనికి కుదిర్చి అక్కడ నుంచి నిషేదిత పేలుడు పదార్ధాలను తరలించేవారని పేర్కొన్నారు. ఇలా సేకరించిన పేలుడు పదార్థాలను చర్లకు చేర్చి భద్రుకు అప్పగించాలనుకున్న క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి సమాచారం మేరకు చర్ల వద్ద సోడె భీమ, మడవి మన్ను, పొడియం మన్ను, కుర్సం ఇడుమ, మడివి భీమ, కల్మ సోనలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఎనిమిది మంది ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టుకు అప్పగించినట్లు ఏఎస్పీ డా. వినీత్ పేర్కొన్నారు.