Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఇంట్లో పనికి సహకరించడం లేదని తల్లిదండ్రులు మందలించినందుకు మనోవేదనకు గురైన ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ప్రకారం... పేరాయిగూడెంకు చెందిన ఇంటర్ చదువుతున్న విద్యార్థినినీ ఇంట్లో పనికి సహకరించడం లేదని తల్లిదండ్రులు గురువారం మందలించారు. దీంతో ఆమె తీవ్ర మనోవేదకు గురైంది.
అదే సమయంలో తన సమీప బంధువు ఒకరు అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళారు. ఎవరూ లేని సమయంలో విద్యార్ధిని ఇంట్లో ఉరేసుకుంది. పక్కింటి వాళ్ళు గమనించి బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్.సి హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు.