Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం మండల కార్యదర్శి భూక్యా కృష్ణ
నవతెలంగాణ-రఘునాధపాలెం
నల్లమల్ల అటవీ ప్రాంతానికి ఇప్పపూల సేకరణ కోసం వెళ్లిన గిరిజనులపై అటవీ శాఖ అధికారులు విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం రఘునాధపాలెం మండల కార్యదర్శి భూక్య కృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడి చేసిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులపై జరిగిన దాడిని చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గిరిజనులపై ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఆయన విమర్శించారు. బాధ్యులైన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనియెడల గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు గుగులోతు కుమార్ తదితరులు పాల్గొన్నారు.