Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండల సీపీఐ సీనియర్ నాయకులు షేక్ నవాబ్ జానీ గుండెపోటుతో గురువారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను శుక్రవారం అశ్వారావుపేట నిర్వహించారు. అతని అకాల మృతికి సీపీఐ మండల సమితి విప్లవ జోహార్లు అర్పించింది. ఆయన అంత్యక్రియలకు జిల్లా కార్యదర్శి షేక్ షాబిర్ పషా, ఆ పార్టీ ఆంధ్ర నాయకులు షేక్ మునిర్, మండల కార్యదర్శి రామకృష్ణ, పట్టణ కార్యదర్శి సయ్యద్ రఫీ పాల్గొన్నారు. జానీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.