Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీవైఎల్ రాష్ట్ర నాయకులు పర్శిక రవి
నవతెలంగాణ-గుండాల
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడ సునీల్ ఆత్మహత్యను ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర నాయకులు పర్శిక రవి అన్నారు. ఈ విషయమై శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వయోపరిమితి పెంచుతూ విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతుందని ఆరోపించారు. విద్యార్థి నిరుద్యోగుల సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యువత ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.