Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కుంజా బోజ్జికి గత కొద్ది రోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధ పడటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయనను సీపీఐ(ఎం) రాష్ట్ర నేతలు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు అందిస్తున్న వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆయన కూతురు మంగమ్మకు వారు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, బి.వెంకట్, సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవి కుమార్, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి తదితరులు పాల్గొన్నారు.