Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని తుమ్మల చెరువులో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల ఆందోళనకు సీపీఐ(ఎం) నాయకులు, మాజీ ఎంపీ మీడియం బాబురావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూడు, గూడు, నీడ లేని గిరిజనులు పోడు వ్యవసా యంతో అనాదిగా జీవిస్తున్నారని వారి పొట్ట కొట్టొద్దు అన్నారు. దున్నే వాడిదే భూమి అన్న విషయం ఆయన గుర్తు చేశారు. పోడు వ్యవసాయానికి పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపు తుందన్నారు. అటవీ అధికారులు పోడుదారులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీరం శ్రీనివాస్, గద్దల శ్రీనివాస్, పోడుదారులు పాల్గొన్నారు.