Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం
నవతెలంగాణ-వైరా టౌన్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలను అడ్డుకునేందుకు ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం అన్నారు. వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో గాలి అరుణ అధ్యక్షతన జరిగిన సీపీఐ(ఎం) వైరా మండల కమిటీ సమావేశంలో భుక్య వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వలన దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారని అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎండాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలు తోపాటు మొక్క జొన్న పంటను కూడా కొనుగోలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, మండల కార్యదర్శివర్గ సభ్యులు పారుపల్లి కష్ణారావు, తూము సుధాకర్, బాణాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.