Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ-పినపాక
కరోనా వలన ప్రయివేట్ స్కూల్స్, కాలేజీలు మూసివేయడం వలన ఉపాధి కోల్పోయిన టీచర్స్ ను, లెక్చరర్స్, వర్కర్స్ను ప్రభుత్వం ఆదుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బయ్యారం క్రాస్ రోడ్లో జరిగిన ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వీరికి జీతాలను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీచర్స్, లెక్చరర్స్ ఇందారపు రవికుమార్, చెన్నారెడ్డి, రామకృష్ణ, వీరప్రసాద్, ప్రభాకర్, సాజి మాన్ వర్మ బాలకృష్ణ, రవి ప్రసాద్ రెడ్డి, విజయ కుమారి వెంకటరమణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.