Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని రాజాపురం గ్రామానికి చెందిన బొమ్మకంటి వీరభద్రరావు (46) సత్తుపల్లి కిరాణా సరుకులు నిమిత్తం వెళ్లి స్వగ్రామం రాజాపురం తిరిగి వస్తుండగా యాతాలకుంట అటవీ ప్రాంతం దగ్గరకి వచ్చే సమయంలో గాలి, దుమ్ము రావడంతో భారీ వృక్షం కూలి ద్విచక్ర వాహనంపై పడటంతో చెట్టులో చిక్కుకొని అక్కడక్కడే మృతి చెందాడు. మృతుడుకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.