Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలంలో బాలిక మిస్సింగ్ కేసు నమోదు
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం దుగినేపల్లిలో మంగళవారం మధ్యాహ్నం కారు ప్రమాదం జరిగింది. భద్రాచలంకి చెందిన 14 యేండ్ల బాలిక ప్రమాదంలో మృత్యు ఒడికి చేరింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం దుగినేపల్లి వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీ కొని అవతలి వైపు ఎదురుగా ఉన్న చెట్టుని కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాలికను హాస్పటల్కి తరలిస్తుండగా మృతి చెందినట్టు తెలిపారు. స్థానికులు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొద్దిగా గాయపడిన యువకుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి వివరాలు సేకరించారు. మృతి చెందిన బాలిక భద్రాచలంకు చెందినదని బాలిక 9వ తరగతి చదువు తుందని గాయపడ్డ తనపేరు చల్ల వెంకటేష్ అని తెలిపాడు. ప్రస్తుతం వెంకటేష్ బయ్యారం పోలీస్ల అదుపులో ఉన్నాడు. భద్రాచలంలో వీరిపై మిస్సింగ్ కేసు నమోదైనట్టుగా ఎస్ఐ సూరి తెలిపారు.