Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు తీవ్ర నష్టం
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలో సోమవారం రాత్రి వచ్చిన గాలి దుమారం వర్షానికి మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొమరారం, పోలవరం, మాణిక్యారం, రాఘవ బోయిన గూడెం తదితర పంచాయతీలలోని గ్రామాలు తండాలో అనేక ఎకరాల్లో ఉన్న మామిడి తోటలకు యేపుగా కాసిన మామిడి కాయలు నేలరాలాయి. రైతులు లబోదిబోమంటున్నారు. ఏడాదంతా కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి మామిడి తోటలను కాపాడామని అకాల గాలి దుమారం వర్షంతో తీవ్ర నష్టం జరిగిందనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఖిలభారత రైతుకూలి సంఘం, ఏఐకేఎంఎస్ డివిజన్ కార్యదర్శి నాయిని, రాజు పార్టీ డివిజన్ నాయకుడు బోస్ కొమరారం ఎంపీటీసీ అజ్మీర బిచ్చలు మంగళవారం రాలిన మామిడి తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం నష్టం వాటిల్లిన రైతులను ఆదుకోవాలని కోరారు.