Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ ముందు ధర్నా
నవతెలంగాణ-భద్రాచలం
పోడు భూముల వ్యవహారంలో అటవీశాఖ అధికారులు ఇకనైనా దౌర్జన్యాలను ఆపాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్డీ ఆధ్వర్యంలో భద్రాచలంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి కెచ్చెల కల్పనా, జిల్లా నాయకులు ముద్దా బిక్షంలు మాట్లాడుతూ పైడిగూడెం ఆదివాసీలు పోడు భూములు వ్యవహారంలో అటవీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. పోడు భూముల వ్యవహారంలో ఆదివాసులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉప సంహరించుకోవాలని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సభకు డివిజన్ నాయకులు దాసరి సాయి అధ్యక్షత వహించారు.