Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత రెడ్డి
నవతెలంగాణ- కామేపల్లి
ఉపాధి హామీ పథకంలో కూలీలను పెంచాలని, ప్రతి ఒక్కరికి ఉపాధి పని కల్పించాలని అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల రివ్యూ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత రెడ్డి హాజరై మాట్లాడారు. ఉపాధి హామీ పథకం పని కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. పంచాయతీలలో, నర్సరీలలో మొక్కలను విధిగా పెంచాలని అన్నారు. కార్యక్రమంలో పీడి శిరీష, ఏపీడీ శ్రీనివాసరావు, ఎంపీడీవో షేక్ శీలార్ సాహేబ్ తదితరులు పాల్గొన్నారు.