Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్
నవతెలంగాణ-ఇల్లందు
దేశంలో బీజేపీ అసత్య ప్రచారాలనూ ప్రచారం చేస్తూ ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తుందని వారి అబద్ధపు మాటలతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారని దానిని ప్రజలందరికీ వివరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే. రమేష్ పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో పార్టీ మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒక మాట మిగతా రాష్ట్రాల్లో మరొక్క మాట మాట్లాడుతున్నారని అసత్యాలను, అబద్దలను ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారని అన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమలు అన్ని కార్పొరేట్ పరం చేస్తూ ప్రజల అవసరాలను తీర్చకుండా మభ్య పెడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, దేవులపల్లి యాకయ్య, మండల కార్యదర్శి తాళ్లూరి కృష్ణ, వజ్జ సురేష్, ఆలేటి కిరణ్, మన్యం మోహన్ రావు, వెంకటమ్మ, సుల్తానా, కూకట్ల శంకర్ పాల్గొన్నారు.