Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
అటవీ సంరక్షణలో రాజీలేదని కారేపల్లి ఫారెస్ట్ రెంజ్ అధికారి పీ.సంతోష్ అన్నారు. శనివారం కారేపల్లి ఫారెస్ట్ రెంజ్ కార్యాలయంలో అటవీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎఫ్ఆర్వో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ఫారెస్టు శాఖ పాత్ర కీలమైందన్నారు. అన్ని శాఖలతో సమన్వయంతో పని చేస్తూ అటవీ సంరక్షణలో బాధ్యతగా మెలగాలని సూచించారు. అడవులు అంతరించటం వలన జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించటం ద్వారా చైతన్యం చేయాలని కోరారు. పోడు భూముల విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవల్సి ఉంటుందన్నారు. హక్కు పత్రాల ఉన్న వారి సాగుకు ఎలాంటి అటంకం కల్గించమన్నారు. అటవీ సంపదను సంరక్షించుకోవటానికి అటవీ ప్రాంతం చుట్టు కందకాలు తవ్వకాలు చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్.ఎల్లయ్య, ఎఫ్ఎస్వోలు సాంబశివరావు, వీరభద్రం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.