Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఆర్వీ కర్ణన్
నవతెలంగాణ-గాంధీచౌక్
యాసంగి సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్ల తో సిద్ధంగా ఉండాలని వ్యవసాయ, పౌర సరఫరాలు మార్క్ ఫెడ్, మార్కెటింగ్, సహకార శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం పీఏసీఎస్ అధ్యక్షులు, సీఈవోలతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే ముందు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకొచ్చి కనీస మద్దతు ధర పొందేలా రైతులను చైతన్యవంతం చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు.