Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరకగూడెం
మండల వైస్ ఎంపీపీ ఎండి.ఆయాబ్ ఖాన్ (48) సోమవారం ఉదయం గుండెపోటు తో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం తెల్లవారు జామున సుమారు ఒంటిగంటకు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు మణుగూరుకు తరలించాగా అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఆయన అంత్యక్రియలను స్వగ్రామమైన పద్మపురంలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించారు. ఆయాబ్ ఖాన్ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ ఆయాబ్ ఖాన్ మరణం పార్టీకి తీరనిలోటుతని అన్నారు. ఈ అంతిమయాత్రలో ఎంపీపీ రేగా కాళికా, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.