Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం జిల్లా పరిషత్ నుంచి బోనకల్ క్రాస్ రోడ్డు వెళ్లే దారిలో తుమ్మల గడ్డ మసీద్ పక్కన నూతనంగా తారు రోడ్డు వేశారు. అయితే, అక్కడే ఉన్న తాగునీరు పైపులైను లీక్ అయ్యింది. అదే ఏరియాలో ఓ వైష్ణవి మిల్క్ సెంటర్లోని అదే పరిస్థితి నెలకొంది. నీరు లీక్ అయి వృథాగా పోతున్న కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు వాపోతున్నారు. కొత్తగా వేసిన తారు రోడ్డుపై వాటర్ లీక్ అయి రోడ్డు కూడా పాడైపోయింది. ఇప్పటికైన అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.