Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా మండలం గొల్లెనపాడు గ్రామంలో సీపీఐ(ఎం) నాయకులు అమరనేని రమాదేవి అనారోగ్యంతో మంగళవారం మరణించారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా పార్టీ కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, మాజీ ఎంపీపి బొంతు సమత, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావులు రమాదేవి మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపినారు. ఈ కార్యక్రమంలో వైరా కోపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కే కోటేశ్వరరావు, పార్టీ మండల నాయకులు వెంకట్ నారాయణ, కిలారి శీను, అమరనేని వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎం) మధిర పట్టణ కార్యదర్శి ఎస్ నరసరావు, వి రాజా, కే ధర్మారావు, సిహెచ్ రాము, ఎస్ ప్రసాదు, సిహెచ్ ప్రసాద్, ఏ సాంబశివరావు, ఏ వేణుగోపాల్ రావు, జి వెంకట్రావు, ఆళ్ల వెంకట్రావు గ్రామ పెద్దలు వివిధ ప్రజా సంఘాల నాయకులు వారి మిత్రులు స్నేహితులు పాల్గొని నివాళులర్పించారు.