Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి సతీమణితో కలిసి సీతారామ శాస్త్రిచే పంచాంగ పఠనం ఆచరించారు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. షడ్రుచుల మేళవింపుతో కుటుంబాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిరాడంబరంగా ఉగాది పంచాంగ పఠన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా సమష్టిగా పోరాడి కరోనాపై విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. తెలుగువారి సంవత్సరాది ఉగాది అని అయితే కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రతి ఒక్కరూ సురక్షిత చర్యలు తీసుకోవాలని కోరారు.