Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
తెలుగు సంవత్సరాది సంప్రదాయబద్ధంగా పూజలు చేస్తూ ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాబోయే సంవత్సరం తమకు సుఖ సంతోషాలతో గడపాలని కోరుతూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గ్రామాల్లో సైతం దేవాలయాలు భక్తులతో నిండిపోయి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయకుమార్ మంగళవారం ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.