Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
మండలంలోని కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. శుక్రవారం ఒక్క రోజే 23 కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రాథమిక వైద్యకేంద్రంలో పనిచేసే వైద్యాధికారితో పాటు సిబ్బంది సమj ుపాలన పాటించడం లేదని రోగులు ఆరోపి స్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రి కి వెళితే సిబ్బంది అందుబాటులో లేరని, విధులకు ఆలస్యంగా వస్తున్నారని, వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో గంటలతరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించిం దని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించి మండల వైద్యకేంద్రంలో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించి విధంగా చర్యలు తీసుకోవాలని మండలప్రజలు డిమాండ్ చేశారు.