Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలోని 28, 40 డివిజన్లలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రల సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ 130వ జయంతి సభలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ రాజ్యాంగంపై దాడి చేస్తున్న మత రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు గంట భీమయ్య, ఎస్కె. సైదులు, కాంపాటి రామస్వామి, మండల వీరస్వామి, విజరు చంద్, జినక శ్రీను, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.