Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదంలో అక్కా తమ్ముడు దుర్మరణం
- తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు చిన్నారులు
నవతెలంగాణ-కొణిజర్ల
బైక్ను ఆటో ఢీ కొట్టిన సంఘటనలో అక్కా తమ్ముడు దుర్మరణం చెందగా ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటన పోలీసు స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ గండికోట మొగిలి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... మండల పరిధిలోని పల్లిపాడు గ్రామానికి చెందిన దేవళ్ల వెంకన్న(34) చెల్లి వరుస అయిన తురక లక్ష్మీ తోపాటు ఆమె పిల్లలతో కలిసి కొణిజర్లలో బంధువుల ఇంటికి పంక్షన్కి గురువారం సాయంత్రం వెళ్లారు. ఉదయాన్నే లేచి కొణిజర్ల నుంచి బైక్పై పిల్లలను తీసుకొని పల్లిపాడు తిరిగి వస్తుండగా పోలీసు స్టేషన్ సమీపంలో ఆటో వేగంగా వచ్చి బైక్ను ఢీ కొట్టింది. దేవళ్ల వెంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు. తురక లక్ష్మీని ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. తురక వెంకటేష్, ఉపేంద్రలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దేవళ్ల జయరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గండికోట మొగలి తెలిపారు..